Monday, December 26, 2011

కీమా పులావ్

మటన్ కీమాతో చేసే ఈపులావ్ చాలా సింపుల్ గా అయిపోతుంది.

ఎప్పుడూ తినే బిర్యానీల మధ్య వెరైటీగా ఉంటుంది.లైట్ ఫ్లేవర్స్ తో 

టేస్ట్ కూడా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


బాస్మతి రైస్                       ఒక గ్లాస్ 

మటన్ కీమా                      పావుకిలో 

ఉల్లిపాయ                          ఒకటి

పచ్చిమిర్చి                        మూడు 

పుదీనా                            అర కట్ట 

కొత్తిమీర                           అర కట్ట 

అల్లంవెల్లుల్లి ముద్ద              రెండు టేబుల్ స్పూన్స్ 

గరం మసాలా పొడి              రెండు టీ స్పూన్స్ 

ఉప్పు,కారం,పసుపు,పెరుగు 

షాజీర.లవంగాలు,చెక్క,యాలకులు,బిర్యానీఆకు,అనాసపువ్వు,జాపత్రి 


తయారు చేసే విధానం:


రెండు టీ స్పూన్స్ పెరుగులో కొంచెం ఉప్పు,కారం,పసుపు,అల్లంవెల్లుల్లి 

ముద్ద,ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలిపాలి.కడిగి ఉంచిన 

కీమాను ఇందులో కలిపి ఒక అరగంట ఉంచాలి.

బాస్మతిబియ్యం కడిగి ఇరవై నిముషాలు నానబెట్టుకోవాలి.

నూనె వేడిచేసి మసాలాదినుసులు అన్నీవేయాలి.సన్నగా వాలికలుగా 

తరిగిన ఉల్లిపాయ,మిర్చి వేసి ఎర్రగా వేగనివ్వాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.మారినేట్ చేసిన కీమా 

వేసి,కలపాలి. కొంచెం ఉడికిన తరువాత తరిగిన పుదీనా,కొత్తిమీర,

పసుపు,కారం,గరంమసాలా పొడి అన్నీ వేసి వేయించాలి.

చివరగా బియ్యం వేసి కలిపి రెండు మూడు నిముషాలు వేయించాలి.

ఇప్పుడు తగినన్ని నీళ్ళు,ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ 

రానివ్వాలి.

వేడివేడిగా రైతాతో కానీ,నాన్ వెజ్ కర్రీతో కానీ తింటే బావుంటుంది.


Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP