Wednesday, November 30, 2011

కారట్ - కోకోనట్ ఖీర్

పాలు తాగమన్నా,కారట్ తినమన్నా వినని పిల్లలకి బెస్ట్ ఆప్షన్ ఈ 

ఖీర్.కొబ్బరితురుము వేయడంతో కొంచెం క్రంచీగా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు :


కారట్                            మూడు 

పాలు                            అరలీటరు 

కొబ్బరితురుము                ఒక కప్పు

పంచదార                        ఒక కప్ప

ఇలాచీ పొడి                    పావు స్పూన్ 

బాదం 


తయారు చేసే విధానం:


కారట్ ఉడికించి పేస్ట్ చేసుకోవాలి.

పాలు కాగాక  పంచదార వేసి మరిగించాలి.ఇందులో పచ్చికొబ్బరి 

తురుము వేసి కొంచెం ఉడికించాలి.

ఇప్పుడు కారట్ పేస్ట్ వేసి కలిపి సన్నని మంటపై కొంచెం చిక్కబడ్డాక 

ఇలాచీపొడి వేయాలి.

ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసే ముందు కొంచెం కొబ్బరితురుము,సన్నగా 

తురిమిన బాదం వేసి ఇస్తే చాలా రుచిగా ఉంటుంది.




Share/Bookmark

Monday, November 28, 2011

బీన్స్ - కారట్ పాటోళీ

పాటోళీ  ట్రెడిషనల్ రెసిపీ.బీన్స్,కారట్ బదులు గోరుచిక్కుళ్ళతో కూడా 

ఈ కూర చేసుకోవచ్చు.లేదా మెంతికూర,కాబేజ్ ఇలాంటివి వేసి కూడా 

చెయ్యొచ్చు.రైస్ లోకి,చపాతీలోకి వెరైటీగా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు:


 ఫ్రెంచ్ బీన్స్                           ఒక కప్పు 

కారట్                                 ఒక కప్పు 

శనగపప్పు                            ఒక కప్పు 

పచ్చిమిర్చి                            మూడు 

అల్లం ముక్క                         చిన్నది 

జీలకర్ర                                ఒక టీ స్పూన్

కరివేపాకు                            ఒక రెమ్మ 

కొత్తిమీర                              కొంచెం

ఉప్పు,కారం,పసుపు,నూనె,గరంమసాలాపొడి,తాలింపుదినుసులు 


తయారు చేసే విధానం:


బీన్స్,కారట్ సన్నగా తరిగి ఉడికించాలి.

శనగపప్పు నానబెట్టుకోవాలి.ఇందులో అల్లం,మిర్చి,జీలకర్ర వేసి కోర్స్ 

గా గ్రైండ్ చేసుకోవాలి.  

నూనె వేడిచేసి తాలింపు వేసి శనగపప్పు పేస్ట్ వేసి వేయించాలి.కొంచెం 

పొడిగా అయ్యాక బీన్స్ కారట్ వేయాలి.

ఉప్పు,పసుపు,కారం వేసి కలిపి సిమ్ లో కూర పొడిగా అయ్యేవరకు 

వేయించి చివరగా కొత్తిమీర,మసాలాపొడి చల్లి కలపాలి.

వేడివేడి అన్నంలో ఈ కూరతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా 

ఉంటుంది.   

ఇందులో పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి వాడొచ్చు.అలాగే ఇష్టం 

లేకపోతే మసాలాపొడి వేయడం మానెయ్యొచ్చు

           


Share/Bookmark

Friday, November 25, 2011

సేమ్యా కట్లెట్స్

సాయంత్రాలు స్నాక్స్ గా ఈ సేమ్యా కట్లెట్స్ బావుంటాయి.ఆలూ,కారట్ 

ఇలా కూరలు కూడా కలుపుతాము కాబట్టి పిల్లలూ ఇష్టంగా తింటారు.







కావలసిన పదార్ధాలు :


సేమ్యా                            రెండు కప్పులు 

ఆలూ                             రెండు 

కారట్                             ఒకటి 

ఉల్లిపాయ                        ఒకటి 

మిర్చి                            రెండు 

అల్లం                            చిన్న ముక్క 

కొత్తిమీర                         ఒక కట్ట 

బియ్యంపిండి                   అర కప్పు 

గరంమసాలాపొడి              ఒక టీ స్పూన్

ఉప్పు ,నూనె 


తయారుచేసే విధానం;  


సేమ్యాను ఉడికించి తీసుకోవాలి.

ఇందులో ఉడికించిన ఆలూ,కారట్,సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,

కొత్తిమీర,తగినంత ఉప్పు,మసాలాపొడి వేసి బాగా కలపాలి.

ఇప్పుడు బియ్యం పిండి కూడా వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ గా నచ్చిన ఆకారంలో చేసుకుని 

నూనెలో వేయించి తీయాలి.

పేపర్ నాప్ కిన్ పై ఉంచితే ఎక్సెస్ ఆయిల్ పోతుంది.టమాటా సాస్ తో 

సర్వ్ చేస్తే రుచిగా ఉంటాయి.

కావాలంటే ఇంకా ఉడికించిన బీన్స్,బటానీ,కార్న్ కూడా వాడొచ్చు.






Share/Bookmark

Tuesday, November 22, 2011

చిక్కుడుకాయ ఫ్రై

చిక్కుడుకాయ కూర చాలామంది ఇష్టంగా తింటారు.మా ఇంట్లో అయితే 

రోజూ చేసినా ఇష్టమే.కాకపోతే కాయల్లో నిండుగా గింజలు ఉండాలి.ఫ్రై 

చేసినా,టమాటా కలిపి కూర ఒండినా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


చిక్కుడుకాయలు                  పావుకిలో 

కరివేపాకు                          ఒక రెమ్మ 

ఉప్పు,పసుపు,నూనె 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,వెల్లుల్లిరెబ్బలు,

పచ్చికారం (కూరల్లో వేసే సంబారుకారం బావుండదు)



తయారు చేసే పద్దతి :


చిక్కుడు కాయలు ముక్కలు చేసి ఉడికించుకోవాలి.

ఈ కూర రుచి అంతా తాలింపు వేయడంలోనే ఉంటుంది.

నూనె వేడిచేసి పప్పులు,ఆవాలు,జీలకర్ర,అయిదారు వెల్లుల్లిరెబ్బలు 

కొద్దిగా చిదిమి వెయ్యాలి. ఇవి దోరగా వేగాక కరివేపాకు కూడా వేసి 

సిమ్ లో పెట్టి పచ్చికారం వెయ్యాలి.స్టవ్ హైలో ఉంటే కారం 

మాడిపోతుంది.

ఒక్క నిమిషం అన్నీవేయించి చిక్కుళ్ళు కూడా వేయాలి.తగినంత 

ఉప్పు,పసుపు వేసి ముక్కల్లో తడి పోయేవరకు వేయించాలి.


Share/Bookmark

Saturday, November 19, 2011

ఆలూ గోబీ ఫ్రై

కాలీఫ్లవర్ సీజన్ మొదలైంది.దీన్ని టమాటా,బటానీ,ఎగ్స్ ఇలా దేనితో 

వండినా ఇష్టంగా తినొచ్చు.ఆలూతో కలిపి చేసే ఈ వేపుడు అన్నంలోకి, 

చపాతీలోకి బావుంటుంది.







కావలసిన పదార్ధాలు:


కాలీఫ్లవర్                         ఒకటి చిన్నది 

ఆలూ                              రెండు 

ఉల్లిపాయ                          ఒకటి 

పచ్చిమిర్చి                        రెండు 

కరివేపాకు                         ఒక రెమ్మ 

కొత్తిమీర                          ఒక కట్ట

అల్లం                            చిన్న ముక్క 

వెల్లుల్లి                           నాలుగు రెబ్బలు

గరంమసాలా పొడి             అర టీస్పూన్ 

ఉప్పు,కారం,పసుపు,నూనె ,తాలింపు దినుసులు


తయారు చేసేవిధానం:


కాలీఫ్లవర్ ను చిన్నపువ్వులుగా విడదీసి ఆలూ ముక్కలతో కలిపి

కొంచెం ఉడికించి వార్చాలి.

నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,కరివేపాకు 

వేసి వాయించాలి.

అల్లం,మిర్చి,వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ వేసి వేయించాలి.

ఇప్పుడు ఉడికించిన ఆలూ,గోబీ వేసి కలపాలి.

తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికేదాక 

వేయించాలి.

చివరగా గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి కలపాలి.
 




Share/Bookmark

Wednesday, November 16, 2011

బూందీ మిఠాయి

బెల్లం,కొంచెం పంచదార కలిపి చేసే అచ్చుమిఠాయి ఇది.పంచదార 

లడ్డూలా మెత్తగా కాకుండా కరకరలాడుతూ ఉంటుంది.చెయ్యగలిగితే 

వేడిమీద లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు.







కావలసిన పదార్ధాలు:


శనగపిండి                           రెండు గ్లాసులు

బియ్యంపిండి                         ఒక గ్లాసు

బెల్లం                                 రెండు గ్లాసులు 

పంచదార                             ఒక గ్లాసు

యాలకుల పొడి                    ఒక టీ స్పూన్

నూనె 


తయారు చేసే విధానం:


శనగపిండి,బియ్యంపిండి తగినన్ని నీళ్ళతో కొంచెం జారుగా 

కలుపుకోవాలి.

ఈ పిండిని బూందీ గరిటలో వేసి కాగిన నూనెలో బూందీ దూసుకోవాలి.

వేగిన తరువాత తీసి జల్లెడలో వేసుకోవాలి.ఇలా బూందీ అంతా రెడీ 

చేసుకోవాలి  

బెల్లం,పంచదార కొంచెం నీళ్ళు పోసి కరిగించి వడపోయాలి.

ఇప్పుడు తిరిగి స్టవ్ పైన ఉంచి బాగా ఉండపాకం పట్టుకోవాలి.ఇందులో 

యాలకులపొడి,బూందీ వేసి బాగా కలిపి పళ్ళెంలో అచ్చు పోసెయ్యాలి.

కాసేపగితే అచ్చు వచ్చేస్తుంది.చిన్నచిన్నముక్కలు చేసి స్టోర్ 

చేసుకోవాలి.

కావాలనుకుంటే అచ్చు పోయకుండా లడ్డూలు చేసుకోవచ్చు.


Share/Bookmark

Sunday, November 13, 2011

ప్రాన్స్ దమ్ బిర్యానీ

నాన్ వెజ్ తో బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం.అదీ రొయ్యలతో చేస్తే 

భలే రుచిగా ఉంటుంది.జనరల్ గా ఈ దమ్ బిర్యానీ చెయ్యడం కష్టం 

అనుకుంటాము కానీ అలవాటు అయిపోతే ఈజీగా చేసెయ్యొచ్చు.

కొంచెం ప్లాన్డ్ గా అన్నీ రెడీ చేసుకోవాలి అంతే.









కావలసిన పదార్ధాలు:

మారినేషన్ కోసం

రొయ్యలు                         అరకిలో 

పెరుగు                           ఒక టేబుల్ స్పూన్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్                ఒక టీ స్పూన్ 

గరంమసాలాపొడి               ఒక టీ స్పూన్ 

పచ్చిమిర్చి                         రెండు 

ఉప్పు,కారం ,పసుపు   


రైస్ కోసం 


బాస్మతి రైస్,ఉప్పు,పుదీనా,కొత్తిమీర,

బిర్యానీ మసాలాలు  

లవంగాలు,చెక్క,యాలకులు,షాజీరా,అనాసపువ్వు,మరాటీమొగ్గ,

జాపత్రి,బిర్యానీ ఆకు 


గ్రేవీ కోసం 

ఉల్లిపాయ                      ఒకటి 

పచ్చిమిర్చి                     రెండు

టమాటా                        ఒకటి(ప్యూరీ)

అల్లంవెల్లుల్లి పేస్ట్             ఒక టేబుల్ స్పూన్ 

గరంమసాలా పొడి           ఒక టీ స్పూన్ 

పుదీనా,కొత్తిమీర,ఉప్పు,పసుపు,కారం,నూనె ,నెయ్యి,కొంచెం పాలలో 

నానబెట్టిన శాఫ్రాన్ 


తయారు చేసే విధానం:


పెరుగులో అన్ని పదార్ధాలు కలిపి,శుభ్రం చేసిన రొయ్యలు వేసి ఒక 

గంట నాననివ్వాలి.

బాస్మతి రైస్ కడిగి ఇరవై నిముషాలు నానబెట్టాలి.

ఒక పెద్దగిన్నెలో నీళ్ళు మరిగించి,అందులో మసాలాదినుసులు,

పుదీనా కొత్తిమీర,కొంచెం ఉప్పు,రైస్ కూడా వేసి ఉడికించాలి.మూడు

వంతులు ఉడికాక వడపోసి రెడీ చేసుకోవాలి.

ఈలోగా ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేడిచేసి 

వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేయించాలి.ఇందులో గ్రైండ్ చేసుకున్న 

టమాటాగుజ్జు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

ఇప్పుడు నానబెట్టుకున్నరొయ్యలు వేసి కలిపి తగినంత ఉప్పు,కారం,

పసుపు,గరంమసాలాపొడి,తరిగిన పొదీనా,కొత్తిమీర వేసి ఉడికించాలి.

గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక బిర్యానీకి అరేంజ్ చేసుకోవాలి.

ప్రెషర్ పాన్ లో కానీ,చిన్నకుక్కర్ లో కానీ కొంచెం నూనెవేసి సగం రైస్ 

పరవాలి.దానిమీద రొయ్యల గ్రేవీ సర్ది, పైన మిగిలిన రైస్ వేయాలి.

పైన రెండు స్పూన్ల నెయ్యి,తరిగిన పొదీనా,కొత్తిమీర వేసి కొంచెం 

పాలలో నానబెట్టిన సాఫ్రాన్ వేసుకోవాలి.

చిన్నబర్నర్ మీద తావా పెట్టి దానిమీద ఈ పాన్ పెట్టి వెయిట్ పెట్టాలి.

రెండుమూడు నిమిషాల తరువాత సిమ్ లో పెట్టెయ్యాలి.విజిల్స్ 

రానక్కరలేదు.ఇలా వెయిట్ పెట్టడం వలన స్టీం బయటికి పోదు.

ఒక పావుగంటలో బిర్యానీ ఘుమఘుమ వాసన వస్తుండగా స్టవ్ ఆఫ్ 

చెయ్యాలి.

ఒకసారి జాగ్రత్తగా కలిపి వేడిగా వడ్డిస్తే ప్రాన్ దమ్ బిర్యానీ నోరూరిస్తుంది.




Share/Bookmark

Friday, November 11, 2011

డేట్స్ - ఆల్మండ్ ఖీర్

బాదం,ఖర్జూరాలు కలిపి చేసే ఈ ఖీర్ చాలా హెల్దీ ఐటం.అస్సలు నెయ్యి 

వాడము కనుక కాలరీస్ భయం కూడా ఉండదు.బ్లాగ్ వనభోజనాలకు

రాసిన ఈ ఖీర్ ను ఇందులో రీపోస్ట్ చేస్తున్నాను. 









కావలసిన పదార్ధాలు : 


చిక్కని పాలు                       పావు లీటరు 

ఖర్జూరాలు                          పది 

బాదంపప్పు                         పది 

ఇలాచీ పొడి                        అర స్పూను 

మిల్క్ మెయిడ్                   రెండు టేబుల్ స్పూన్స్  



తయారు చేసే విధానం :


ముందుగా బాదంపప్పును వేడినీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసుకోవాలి.

ఖర్జూరాలు గింజలు తీసేసి కొంచెం నీటిలో ఉడికించాలి.

ఈ రెంటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అవసరమైతే కొంచెం పాలు 

వాడొచ్చు.

ఇప్పుడు పాలను కొంచెం మరిగించి బాదం ఖర్జూర మిశ్రమం వేసి 

ఉడికించాలి.

చివరగా మిల్క్ మెయిడ్ వేసి కలపాలి.ఇది లేకపోతే తగినంత 

పంచదార వేసుకోవచ్చు.

ఇలాచీపొడి వేసి కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.చల్లారాక ఇంకా 

చిక్కగా అవుతుంది 

సన్నగా తరిగిన బాదం,ఖర్జూరాలతో అలంకరించుకోవాలి. 

కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తింటే బావుంటుంది.ఇష్టం ఉంటే చివరలో రెండు 

స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు.



Share/Bookmark

Tuesday, November 8, 2011

మలై ప్రాన్స్

నాన్ వెజ్ లో చికెన్ తరువాత చాలా ఇష్టంగా తినేవి రొయ్యలు.ఈ కర్రీ 

బిర్యానీ,పులావుల్లోకి,ముఖ్యంగా కొబ్బరన్నం(కొబ్బరిపాలతో చేసే రైస్)

లోకి చాలా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


రొయ్యలు                             కిలో 

ఉల్లిపాయలు                         రెండు

పచ్చిమిర్చి                          రెండు 

కరివేపాకు                           ఒక రెమ్మ 

కొత్తిమీర                             ఒక కట్ట 

మీగడ(క్రీం)                        రెండు టేబుల్ స్పూన్స్  

అల్లంవెల్లుల్లి ముద్ద                 రెండు టీ స్పూన్స్

ఉప్పు,కారం,పసుపు,నూనె 

తాలింపుకు ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి 


మసాలా పొడి కోసం:

ఆరు లవంగాలు,చిన్న దాల్చినచెక్క ముక్క,ఒక టీస్పూన్ ధనియాలు,

అర టీస్పూన్ జీలకర్ర,ఒక టీస్పూన్ గసగసాలు,కొంచెం ఎండుకొబ్బరి 

అన్నీకలిపి మెత్తగా పొడి కొట్టుకోవాలి.


తయారు చేసే విధానం:


రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,

మిర్చి,కరివేపాకు వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి, గ్రైండ్ చేసుకున్నమసాలా

పొడి కూడా వేయాలి.పసుపు,కారం కొద్దిగా నీళ్ళు చల్లి బాగా కలపాలి.

రెండు నిమిషాల తరువాత శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసి 

ఉడికించాలి.

చివరగా తగినంత ఉప్పువేసి అవసరమైతే ఓ పావుకప్పు నీళ్ళు పోయాలి.

రొయ్యలు ఉడికి కూర దగ్గరవుతుండగా తరిగిన కొత్తిమీర,క్రీం వేసి కలిపి 

మరో రెండు నిముషాలు ఉడికించాలి.

ఎంతో రుచిగా ఉండే ఈ మలైప్రాన్స్ రోటీ,నాన్ వీటితో కూడా 

బావుంటుంది.
 


Share/Bookmark

Thursday, November 3, 2011

పనీర్ - స్వీట్ కార్న్ టోస్ట్

స్వీట్ కార్న్,పనీర్ కలిపి చేసే ఈ టోస్ట్ వెరైటీగా ఉంటుంది.ఉదయం 

బ్రేక్ ఫాస్ట్ కైనా, ఈవెనింగ్ స్నాక్స్ గా అయినా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు :


బ్రెడ్                               నాలుగు స్లైసులు 

స్వీట్ కార్న్                       ఒక కప్పు 

పనీర్                             అర కప్పు 

ఉల్లిపాయ                         ఒకటి 

మిర్చి                             రెండు 

కొత్తిమీర                          కొంచెం

ఉప్పు,మిరియాలపొడి,చీజ్,టమాటాసాస్, 

ఒక టీ స్పూన్ వెన్నలేదా నెయ్యి  


తయారు చేసే విధానం:


స్వీట్ కార్న్ ఉడికించి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇందులోతురిమిన పనీర్ సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కొత్తిమీర,

ఒక టేబుల్ స్పూన్ టమాటాసాస్,ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా 

మిక్స్ చెయ్యాలి.

బ్రెడ్ పైన  కొంచెం వెన్న, నెయ్యి రాసి కార్న్ మిశ్రమం సర్దాలి 

మైక్రోవేవ్  కన్వెక్షన్ మోడ్ లో 200 డిగ్రీలకు ప్రీహీట్ చెయ్యాలి.

ఇప్పుడు కార్న్ మిశ్రమం మీద చీజ్ వేసి అయిదారు నిముషాలు లేదా 

చీజ్ కరిగేవరకు బేక్  చెయ్యాలి.

టమాటా సాస్ తో వేడిగా తింటే క్రిస్పీగా బావుంటాయి.  

                


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP