Sunday, November 4, 2012

కజ్జికాయలు

పండగలకి చేసే ముఖ్యమైన పిండివంటల్లో ఈ కజ్జికాయలు చాల 

ఫేమస్.వీటిని కొంతమంది పుట్నాలపప్పు పొడితో,మరి కొందరు 

రవ్వతోనూ చేస్తారు.అలాగే చాలామంది పంచదారతో చేస్తారు కానీ 

బెల్లం ఎక్కువ వేసి కొద్దిగా పంచదార వేస్తే చాలా రుచిగా ఉంటాయి.








కావలసిన పదార్ధాలు :



మైదాపిండి                           పావుకిలో 

వెన్న లేదా నెయ్యి                  రెండు టేబుల్ స్పూన్స్ 

ఉప్పు                                   కొద్దిగా 


లోపల నింపడానికి 



బొంబాయిరవ్వ                             రెండు కప్పులు

ఎండుకొబ్బరి                               ఒక కప్పు 

బెల్లంతురుము                             ఒక కప్పు 

పంచదార                                   మూడు స్పూన్స్ 

కాజూ,బాదం                               పది పది చొప్పున 

కిస్మిస్                                        పది 

ఇలాచీ పొడి                               అర స్పూన్ 

నూనె  


తయారు చేసే విధానం:



మైదాపిండిలో  వెన్న లేదా నెయ్యి ,కొద్దిగా ఉప్పు వేసి కొంచెం నీరు 

చల్లుకుంటూ పూరీ పిండిలా కలుపుకుని మూతపెట్టి ఉంచాలి.

ఒక పాన్ లో బొంబాయిరవ్వ వేసి సన్నని సెగపై వేయించాలి.కాస్త 

వేగిన తరువాత తురిమిన ఎండుకొబ్బరి కూడా వేసి కమ్మని సువాసన 

వచ్చేవరకూ వేయించాలి.

ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని తురిమిన బెల్లం,పంచదార,

ఇలాచీపొడి,సన్నగా తరిగిన కాజూ,బాదాం,కిస్మిస్ అన్నీ వేసి బాగా 

కలపాలి.

ఇప్పుడు నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలు చేసి పూరీలు 

చేసుకోవాలి.

కజ్జికాయల చెక్కకు కొంచెం నూనె రాసి ఈ పూరీని దానిపై వేసి  

మధ్యలో  రెండు స్పూన్స్ రవ్వ మిశ్రమం వెయ్యాలి.

అంచులు తడిచేసి చెక్కను ప్రెస్ చేసి కజ్జికాయలను చేసుకోవాలి.

ఇలా అన్నీ చేసుకుని కాగిన నూనెలో రెండువైపులా వేయించి 

తీసుకోవాలి. 

చల్లారాక స్టోర్ చేసుకుంటే ఇవి వారం రోజులవరకూ నిలువ ఉంటాయి. 


Share/Bookmark

Saturday, October 13, 2012

మెంతికూర - టమాటా పచ్చడి

కమ్మని సువాసనతో ఉండే మెంతికూరతో చేసే ఈ పచ్చడి అన్నం 

లోకీ,ఇడ్లీ,దోశ లోకి కూడా బావుంటుంది.ఇందులో తీపి ఇష్టం లేని 

వారు బెల్లం వేయకుండా చేసుకోవచ్చు.









కావలసిన పదార్ధాలు:


మెంతి కూర                          మూడు కట్టలు 

టమాటాలు                           రెండు 

ఎండుమిర్చి                          నాలుగైదు 

కరివేపాకు                            ఒక రెమ్మ 

వెల్లుల్లి రెబ్బలు                       నాలుగు 

జీలకర్ర                                ఒక టీ స్పూన్ 

శనగపప్పు                           ఒక టీ స్పూన్ 

చింతపండు                           కొద్దిగా 

బెల్లం                                 ఒక టీ స్పూన్ 

ఉప్పు,నూనె,తాలింపు దినుసులు 



తయారు చేసే విధానం:



మెంతికూర ఆకులు మాత్రం తీసి కడిగి పెట్టుకోవాలి.

ఒక స్పూన్ నూనె వేడి చేసి శనగపప్పు,జీలకర్ర,ఎండుమిర్చివెల్లుల్లి 

వేసి  దోరగా వేయించి తీయాలి.

మరొక స్పూన్ నూనె వేసి టమాటా ముక్కలు.మెంతి కూర వేసి 

వేయించాలి.

చల్లారిన తరువాత ఎండుమిర్చి మిశ్రమం,ఉప్పు,చింతపండు వేసి 

గ్రైండ్ చెయ్యాలి.

ఇప్పుడు టమాట,మెంతికూర,బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

అవసరం అయితే కొంచెం నీరు వాడొచ్చు.

ఒక స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడి అందులో వేసి 

కలపాలి. 


Share/Bookmark

Sunday, October 7, 2012

రాజ్ మా - పనీర్ గ్రేవీ

పూరీ,చపాతీ వీటిలోకి వెరైటీగా ఉండే కూరలు బావుంటాయి.తక్కువ 

ఆయిల్ తో చేసుకోగల ఈ కర్రీ ఆరోగ్యానికి కూడా మంచిది.రాజ్మా ను 

ఉడికించి రెడీగా ఉంచుకుంటే పదినిమిషాల్లో అయిపోతుంది.







 కావలసిన పదార్ధాలు:



రాజ్ మా                       ఒక కప్పు 

పనీర్                           ఒక కప్పు 

ఉల్లిపాయ                      ఒకటి 

పచ్చిమిర్చి                    రెండు 

టమాటాలు                   మూడు

కరివేపాకు                     ఒక రెమ్మ 

కొత్తిమీర                       కొద్దిగా 

మీగడ                         రెండు స్పూన్స్ 

అల్లం,వెల్లుల్లి                 ఒక టీ స్పూన్ 

గరంమసాలాపొడి           ఒక టీ స్పూన్ 

ఉప్పు,కారం,పసుపు,నూనె,తాలింపు దినుసులు 



తయారు చేసే విధానం:


రాజ్ మాను నానబెట్టి ఉడికించాలి.

రెండు టీస్పూన్స్ నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన 

ఉల్లి,మిర్చి ముక్కలు,కరివేపాకు వేసి వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం,వెల్లుల్లి తురుము వేసి వేగనివ్వాలి.

టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. 

పసుపు,కారం,తగినంత ఉప్పు వేసి కలిపి రాజ్ మా,పనీర్ ముక్కలు 

కూడా వేసి కలిపి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి,

గ్రేవీ చిక్కగా అయ్యాక గరంమసాలాపొడి చల్లి ,మీగడ కూడా వేసి 

కలపాలి.

చివరగా తరిగిన కొత్తిమీర చల్లి వేడివేడిగా చపాతీలతో తింటే చాలా 

రుచిగా ఉంటుంది.


 


Share/Bookmark

Friday, September 28, 2012

ఆలూ ఫ్రై

ఆలుగడ్డ వేపుడు ఇష్టపడని వారు బహుశా ఎవరూ ఉండరేమో.ఇంట్లో 

ఏ కూరగాయలూ లేనప్పుడు కూడా రెండు దుంపలు ఉంటే రెడీ 

అయిపోయే ఈకూరను మైక్రోవేవ్ లో ఇంకా సింపుల్ గా చేసెయ్యొచ్చు. 







కావలసిన పదార్ధాలు:


బంగాళదుంపలు              మూడు 

ఉల్లిపాయ                      ఒకటి 

పచ్చిమిర్చి                     రెండు 

కరివేపాకు                      ఒకరెమ్మ 

కొత్తిమీర                        కొద్దిగా 

అల్లంతురుము               అర స్పూన్ 

ఉప్పు,కారం,పసుపు,నూనె,గరంమసాలా పొడి 

తాలింపుకు శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి.



తయారు చేసే విధానం:



దుంపలు చెక్కు తీసి సన్నగా తరిగి నీళ్ళలో వేయాలి.

అల్లం,మిర్చి నూరుకోవాలి.

మైక్రో సేఫ్ బౌల్ లో నూనె వేసి వేడిచేసి తాలింపు దినుసులు వేసి 

ఒక నిమిషం హై లో పెట్టాలి.

సన్నగా తరిగిన ఉల్లిపాయ,అల్లం మిర్చి ముద్ద వేసి రెండు నిమిషాలు

 పెట్టాలి.

ఇప్పుడు ఆలు ముక్కలు వేసి కలిపి మూడు నిముషాలు హై లో పెట్టాలి.

ఉప్పు,పసుపు,కారం వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూడు నిముషాలు 

పెట్టాలి.

చివరగా గరం మసాలా పొడి,కొత్తిమీర వేసి కలిపి మరొక రెండు 

నిముషాలు పెడితే కమ్మని ఫ్రై రెడీ అవుతుంది.

మైక్రోవేవ్ లో చేయడం వలన కూర ముద్ద అవకుండా పొడిపొడిగా 

వస్తుంది.



Share/Bookmark

Monday, September 17, 2012

చాకో నట్ లాలీపప్స్



చాక్లెట్,బిస్కట్స్,నట్స్ ఇలా అన్నీ ఇష్టమైనవి కలిపి వాటిని లాలీపప్స్ 

లా ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టపడతారు పది నిమిషాల్లో చేసి వెరైటీగా 

ఇవ్వొచ్చు.చెపితే తప్ప ఇందులో బిస్కట్స్ కలిపినట్టు తెలియదు 











కావలసిన పదార్ధాలు:


మారీ బిస్కట్స్                    ఒక చిన్నపాకెట్ 

ఫైవ్ స్టార్ చాక్లెట్                  ఒకటి 50 గ్రామ్స్ 

పంచదార                         రెండు టీ స్పూన్స్ 

నెయ్యి లేదా వెన్న               రెండు టీ స్పూన్స్ 

క్రీం                               రెండు టీ స్పూన్స్ 

వెనీలా ఎసెన్స్                    కొద్దిగా 

కాజూ,బాదం,కిస్మిస్ అన్నీ కలిపి ఒక చిన్న కప్ 


తయారు చేసే విధానం:


మారీ బిస్కట్స్ ను పొడి చేసుకోవాలి 

చాక్లెట్ ను ముక్కలు చేసి మెల్ట్ చేసుకోవాలి.ఇందులో నెయ్యి,క్రీం 

వేసి కలపాలి.

పంచదారను పొడి చేసి బిస్కట్  పొడిలో వేయాలి.

కాజూ,బాదం ను కొన్నింటిని కోర్స్ గా గ్రైండ్ చేసి ,మరి కొన్నింటిని 

సన్నగా తరిగి ఈ మిశ్రమంలో వేయాలి.కిస్మిస్ కూడా వేయాలి.

చివరగా ఎసెన్స్,కరిగిన చాక్లెట్ మిశ్రమం కూడా వేసి బాగా కలిపి చిన్న

చిన్న బాల్స్ చేయాలి.

ఈ బాల్స్ కి టూత్ పిక్స్ గుచ్చి ఇస్తే లాలీపప్స్ రెడీ.  

ఒకవేళ బాల్స్ చెయ్యడానికి రాక పొడిపొడిగా ఉంటె ఒక స్పూన్ పాలు 

చల్లుకుని చెయ్యొచ్చు.

కావాలంటే చాక్లెట్ ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు


Share/Bookmark

Friday, September 14, 2012

ఫ్రూటీ కార్న్ సలాడ్

ఎప్పుడైనా ఒక పూట బ్రేక్ ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లైట్ గా చేసేద్దాం 

అనుకుంటే ఈ సలాడ్ మంచి ఆప్షన్.హాయిగా టేబుల్ దగ్గర కూర్చుని 

చేసుకోవచ్చు.







కావలసిన పదార్ధాలు:



ఉడికించిన స్వీట్ కార్న్     ఒక కప్పు 

బొప్పాయి,మామిడి,యాపిల్,అరటి,ద్రాక్ష,దానిమ్మ ఇలా ఇంట్లో ఉన్న 

ఏవైనా పళ్ళ ముక్కలు      రెండు కప్పులు 

ఉప్పు,మిరియాలపొడి        చిటికెడు 

చాట్ మసాలా                పావు స్పూన్ 

తేనె                         రెండు స్పూన్స్ 


తయారు చేసే విధానం:



అన్ని పళ్ళూ  సన్నగా కట్ చేసుకోవాలి.

ఇందులో ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేయాలి.

చిటికెడు ఉప్పు,మిరియాలపొడి,చాట్ మసాలా,తేనే అన్నీ వేసి బాగా 

కలిపి సర్వ్ చేసేయ్యడమే.

ఇష్టం ఉంటే కొంచెం నిమ్మరసం కూడా వెయ్యొచ్చు

మిగిలిన ఫ్రూట్స్ అన్నీ ముందు కట్ చేసి ఉంచుకున్నా,యాపిల్,అరటి 

మాత్రం సర్వ్ చేసేటప్పుడు కట్ చేసి కలపాలి.



Share/Bookmark

Sunday, September 9, 2012

సగ్గుబియ్యం - సొరకాయ పాయసం

చాలామంది సొరకాయ ఇష్టంగా తింటారు.చాలామంది తినరు కూడా.

ఏది ఏమైనా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదైన ఈ సొరకాయతో 

కూరలే కాదు క్రీమీగా ఉండే ఈ పాయసం కూడా బావుంటుంది.చేసి 

చూడండి.






కావలసిన పదార్ధాలు:



సొరకాయ తురుము               ఒక కప్పు 

సన్న సగ్గుబియ్యం                రెండు టీ స్పూన్స్ 

పాలు                               అర లీటరు 

పంచదార                          అర కప్పు 

ఇలాచీ పొడి                       ఒక టీ స్పూన్ 

నెయ్యి                             ఒక టేబుల్ స్పూన్ 

కాజూ,బాదం,కిస్మిస్ 



తయారు చేసే విధానం:



సొరకాయ చెక్కు తీసి తురుముకుని నీరు పిండేసి ఉంచుకోవాలి.

నెయ్యి వేడి చేసి కాజూ,కిస్మిస్ వేయించి తీసుకోవాలి.

ఇదే నేతిలో సొరకాయ తురుము నాలుగైదు నిముషాలు వేయించాలి.

ఇప్పుడు పాలు పోసి,సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించాలి.

సగ్గుబియ్యం ఉడికి,సొరకాయ తురుము మెత్తగా అయ్యాక పంచదార 

వేసి కలపాలి.

పాయసం చిక్కబడుతుండగా ఇలాచీ పొడి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

కాజూ,బాదం,కిస్మిస్ వేసి కలిపి ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చెయ్యాలి.

సగ్గుబియ్యం ఆప్షనల్.వెయ్యకుండా కూడా చెయ్యొచ్చు.అలాగే సన్నవి 

లేకపోతే మామూలు సగ్గుబియ్యం కూడా వాడొచ్చు.




Share/Bookmark

Thursday, September 6, 2012

కాప్సికమ్ - టమాటా రైస్

క్రంచీగా ఉండే కాప్సికం ఇష్టపడతారా,అయితే ఈ రైస్ వెరైటీ 

తప్పకుండా నచ్చుతుంది. లంచ్ బాక్స్ లోకి చేసి ఇవ్వాలన్నాఈజీగా 

చేసి ఇవ్వొచ్చు.ఎక్కువ మసాలాలు లేకుండా లైట్ ఫ్లేవర్ తో ఉంటుంది.








కావలసిన పదార్ధాలు:




అన్నం                       రెండు కప్పులు 

కాప్సికం                     ఒకటి 


టమాటా                     ఒకటి 


ఉల్లిపాయ                   ఒకటి


పచ్చిమిర్చి                 ఒకటి 


కొత్తిమీర                     కొద్దిగా


కాజూ                        అయిదారు 


ఉప్పు,కారం,పసుపు,నూనె


వేయించిన పల్లీలు,నువ్వుల పొడి లేదా గరం మసాలా పొడి 





తయారు చేసే విధానం:


రెండు టీ స్పూన్స్ నూనె వేడిచేసి కాజూ,జీలకర్ర,ఆవాలు వేయాలి.

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి వేగిన తరువాత సన్నగా తరిగిన 

టమాటా వేయాలి.

టమాటా ఉడికిన తరువాత కాప్సికం ముక్కలు వేసి బాగా కలిపి 

వేగనివ్వాలి.

చిటికెడు పసుపు,కారం వేసి అన్నం,తగినంత ఉప్పు వేసి బాగా 

కలపాలి.చివరగా అరస్పూన్ గరంమసాలా పొడి,కొత్తిమీర చల్లి కలిపి 

రెండు నిముషాలు  వేయించాలి.

మసాలా ఫ్లేవర్ వద్దు అనుకుంటే వేయించిన పల్లీలు,నువ్వుల పొడి 

ఒక టీ స్పూన్ వేస్తే కూడా చాలా బావుంటుంది.




Share/Bookmark

Monday, July 30, 2012

మేథీ - కార్న్ పులావ్

రకరకాల కాంబినేషన్స్ తో చేసే రైస్ ఐటమ్స్ ఎప్పుడూ నచ్చుతాయి.

ఆకుపచ్చని మెంతికూర,స్వీట్ కార్న్ కలిపి చేసే ఈ పులావ్ కూడా 

ఈజీగా చేసెయ్యొచ్చు.పెరుగు చట్నీ దీనిలోకి బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


బాస్మతి రైస్                        రెండు కప్పులు

స్వీట్ కార్న్                         ఒక కప్పు

మెంతి కూర                        మూడు కట్టలు

టమాటాలు                         రెండు

ఉల్లిపాయ                          ఒకటి

పచ్చిమిర్చి                        రెండు

కొత్తిమీర                           ఒక కట్ట

ఉప్పు,కారం,పసుపు,నూనె,అల్లంవెల్లుల్లి పేస్ట్,గరంమసాలా పొడి.

లవంగాలు,చెక్క,షాజీర.


తయారు చేసే విధానం:


బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.

పాన్ లో నూనె వేడిచేసి చెక్క,లవంగాలు,షాజీర వేసి వేగనివ్వాలి.

ఇప్పుడు వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి వేయించి టమాటా 

ముక్కలు వేయాలి. 

టమాటాలు మెత్తగా ఉడికిన తరువాత పసుపు,కారం,ఒక టేబుల్ 

స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి తరిగిన మెంతికూర,స్వీట్ 

కార్న్,ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి కలపాలి.

రెండు మూడు నిముషాలు వేయించి తగినన్ని నీళ్ళు,ఉప్పు వేయాలి.

నీరు మరిగినప్పుడు బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్ 

వచ్చాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

స్టీం అంతా పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి వేడిగా సర్వ్ 

చెయ్యాలి. వేడివేడిగా ఏదైనా రైతాతో తింటే బావుంటుంది.

ఇందులో స్వీట్ కార్న్ బదులు మామూలు కార్న్ అయినా వాడొచ్చు.
               


Share/Bookmark

Tuesday, July 24, 2012

పనీర్ ఎగ్ కర్రీ

పనీర్,ఎగ్  రెండూ పిల్లలు ఇష్టంగా తినేవే.ఈ రెంటితో సింపుల్ గా 

అయిపోయే ఈ కూర అన్నంలోకి,చపాతీ లోకీ కూడా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు :




పనీర్                          100 గ్రాములు 

ఎగ్స్                            రెండు 

టమాటాలు                    రెండు 

ఉల్లిపాయ                     ఒకటి 

పచ్చిమిర్చి                   రెండు 

కరివేపాకు                    ఒక రెమ్మ 

కొత్తిమీర                      కొద్దిగా 

అల్లం తురుము             అర స్పూన్ 

వెల్లుల్లి                       రెండు రెబ్బలు 

ఉప్పు,కారం,పసుపు,నూనె,గరంమసాలా పొడి.

తాలింపుకు ఆవాలు,జీలకర్ర,శనగపప్పు,ఎండుమిర్చి.



తయారు చేసే విధానం:




పనీర్ ను పొడిపొడిగా చిదిమి ఉంచుకోవాలి.

నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి 

వేయించాలి.

ఇప్పుడు సన్నగా తురిమిన అల్లం,వెల్లుల్లి,కరివేపాకు వేసి వేగిన 

తరువాత టమాట ముక్కలు వేయాలి.

తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి టమాటా బాగా మెత్తగా అయ్యేదాకా 

ఉడికించాలి.

ఈలోగా మరొక పాన్ లో ఒక టీ స్పూన్ నూనెలో ఎగ్స్ బ్రేక్ చేసి వేసి 

పొడిగా వేయించాలి.

టమాట మెత్తగా ఉడికిన తరువాత పనీర్ ను,వేయించుకున్న ఎగ్స్ ను

 వేసి బాగా కలపాలి.

చివరగా గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి కలిపి కొంచెంసేపు వేయించి 

దింపెయ్యాలి.


ఇష్టం ఉంటే ఇందులో ఉడికించిన పచ్చిబటానీ లేదా కాప్సికం కూడా 

వేసుకోవచ్చు.


Share/Bookmark

Sunday, July 22, 2012

చికెన్ పులావ్

చికెన్ బిర్యానీ చేయడం కొంచెం కష్టమైన పని అయితే ఈ పులావ్

చేయడం చాలా తేలిక.అన్నీ రెడీ చేసుకుంటే పావుగంటలో 

అయిపోతుంది.చల్లచల్లని వెదర్ లో స్పైసీగా నోరూరిస్తుంది.








కావలసిన పదార్ధాలు:


బాస్మతి రైస్                              ఒక గ్లాస్ 

చికెన్                            పావుకిలో 

ఉల్లిపాయ                       ఒకటి 

పచ్చిమిర్చి                     మూడు 

టమాటాలు                     రెండు 

కొత్తిమీర                        ఒక కట్ట 

పుదీనా                         ఒక కట్ట

పెరుగు                        రెండు టీ స్పూన్స్ 

గరంమసాలాపొడి             రెండు టీ స్పూన్స్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్              రెండు టీ స్పూన్స్ 

ఉప్పు,పసుపు,కారం,నూనె  

మసాలాదినుసులు 

లవంగాలు,చెక్క,యాలకులు,మరాటీ మొగ్గ ,అనాసపువ్వు,జాపత్రి,

బిర్యానీ ఆకు.



తయారు చేసే విధానం:


బియ్యం కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. 

పుదీనా,కొత్తిమీర,పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

పెరుగులో అల్లంవెల్లుల్లి పేస్ట్,ఒక టీస్పూన్ గరంమసాల పొడి,పుదీనా 

పేస్ట్,కొద్దిగా ఉప్పు,పసుపు,కారం వేసి బాగా కలిపి చికెన్ వేసి కలిపి ఒక 

అరగంట నాననివ్వాలి.

నూనె వేడిచేసి మసాలా దినుసులు వేసి వాలికలుగా కోసిన ఉల్లి

ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.

ఇప్పుడు తరిగిన టమాటాముక్కలు వేసి ఇవి ఉడికిన తరువాత చికెన్ 

మిశ్రమం వేసి కలపాలి.

చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత ఒక స్పూన్ మసాలాపొడి వేసి కలిపి 

తగినన్ని నీళ్ళు,ఉప్పు వేయాలి.

నీరు మరుగుతుండగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి 

మూడు విజిల్స్ రానివ్వాలి.

రెడీ అయిన చికెన్ పులావు ను ఒకసారి కలిపి పెరుగు చట్నీతో 

వడ్డించాలి.
 


                     


Share/Bookmark

Saturday, June 23, 2012

రైస్ - ఓట్స్ టిక్కీస్ (బాల్స్)

సన్నగా వర్షం పడుతుంటే వేడివేడిగా తినాలనిపిస్తుంది ఎవరికైనా.

రెగ్యులర్ గా చేసే బజ్జీలు,పకోడీలు పక్కన పెట్టి కొంచెం వెరైటీగా ఇవి 

చేసి చూస్తే  భలే ఉన్నాయి.నాకైతే టిక్కీల కంటే కూడా బాల్స్ ఇంకా 

బాగా నచ్చాయి 

.







కావలసిన పదార్ధాలు:


అన్నం                      ఒక కప్పు 

ఓట్స్                         అర కప్పు 

ఆలూ                         రెండు 

ఉల్లిపాయ                    ఒకటి 

పచ్చిమిర్చి                  రెండు 

అల్లం                       ఒక స్పూన్ 

పుదీనా                     రెండు స్పూన్స్ 

కొత్తిమీర                    రెండు స్పూన్స్ 

కార్న్ ఫ్లోర్                 ఒక టేబుల్ స్పూన్

చాట్ మసాలా              ఒక టీ స్పూన్ 

బ్రెడ్ క్రంబ్స్                   అర కప్పు 

ఉప్పు,నూనె 




తయారు చేసే విధానం:



అన్నం ఒక బౌల్ లోకి తీసుకుని మెత్తగా మాష్ చేసుకోవాలి.

ఉడికించిన ఆలూ కూడా మాష్ చేసి అన్నంలో వెయ్యాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,పుదీనా,కొత్తిమీర వేయాలి.

చివరగా ఓట్స్,కార్న్ ఫ్లోర్ ,తగినంత ఉప్పు,చాట్ మసాలాపొడి వేసి 

బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న టిక్కీలు కానీ,బాల్స్ కానీ చేసి బ్రెడ్ 

క్రంబ్స్ లో రోల్ చేసి కాగిన నూనెలో వేయించాలి. ఎర్రగా వేగాక తీసి

 పేపర్ నాప్ కిన్ పై ఉంచాలి.

వేడివేడిగా టమాటా సాస్ తో తింటే బావుంటాయి.


Share/Bookmark

Thursday, June 21, 2012

చాకో ఫ్రెంచ్ టోస్ట్

బ్రెడ్ ఇంట్లో ఉంది అంటే రకరకాల టోస్ట్ లు  చేస్తూనే ఉంటాము.పిల్లలూ 

ఇష్టంగా తింటారు కూడా.రెగ్యులర్ గా చేసే ఫ్రెంచ్ టోస్ట్ నే కొంచెం 

వెరైటీగా చేస్తే బావుంటుంది.చాకో ఫ్లేవర్ తో ఎట్రాక్టివ్ గా ఉంటుంది.







కావలసిన పదార్ధాలు:



బ్రెడ్                            నాలుగు స్లైసులు 

ఎగ్స్                            రెండు 

పాలు                          అర కప్పు 

పంచదార                     రెండు టేబుల్ స్పూన్స్ 

కోకో పౌడర్                   ఒక టేబుల్ స్పూన్ 

బేకింగ్ పౌడర్                చిటికెడు 

వెనీలా ఎసెన్స్               కొద్దిగా 

నెయ్యి                        రెండు స్పూన్స్

కాజూ,బాదం                 ఒకస్పూన్  



తయారు చేసే విధానం:


ముందుగ ఎగ్స్ బ్రేక్ చేసి ఒక బౌల్ లోకి తీసుకుని పంచదార కలిపి బీట్ 

చెయ్యాలి.

ఇందులో పాలు,కోకో పౌడర్ వేసి మళ్ళీ బీట్ చెయ్యాలి.

చివరగా బేకింగ్ పౌడర్,ఎసెన్స్ వేసి కలపాలి.

బ్రెడ్ స్లైసెస్ ను ఈమిశ్రమంలో రెండువైపులా ముంచి తావాపై పెట్టాలి.

నెయ్యి వేసి రెండు వైపులా కాల్చాలి.

ఈ స్లైసెస్ ను రెండుగా కట్ చేసి కాజూ,బాదం పౌడర్ చల్లి సర్వ్ 

చెయ్యాలి.లేదా ఫ్రెష్ ఫ్రూట్ పీసెస్ తో అయినా సర్వ్ చెయ్యొచ్చు.


Share/Bookmark

Wednesday, June 20, 2012

పనీర్ - టమాటా పులావ్

టమాటా ప్యూరీ,పనీర్ కలిపి చేసే ఈ రైస్ డిష్ కోసం ఎక్కువ పదార్ధాలు 

 అవసరం ఉండదు చల్లని ఈ వెదర్ లో స్పైసీగా చాలా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు :


సన్నబియ్యం                       ఒక గ్లాస్ 

పనీర్                               వంద గ్రాములు 

టమాటాలు                          మూడు 

ఉల్లిపాయ                           ఒకటి 

పచ్చిమిర్చి                         మూడు 

కరివేపాకు                          ఒక రెమ్మ 

కొత్తిమీర                            ఒక కట్ట 

పుదీనా                            ఒక కట్ట 

ఉప్పు,కారం,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,గరంమసాలా పొడి,నూనె.

లవంగాలు,చెక్క,షాజీర,బిర్యానీ ఆకు 




తయారు చేసే విధానం:


పనీర్ ను చిన్న ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు,కారం,పసుపు,

పావు స్పూన్ గరంమసాలా పొడి వేసి కలిపి ఒక పావుగంట మారినేట్ 

చెయ్యాలి.

బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టుకోవాలి.

టమాటాలు ఉడికించి గ్రైండ్ చేసి  ప్యూరీ చేసుకోవాలి.లేదా రెడీమేడ్ 

ప్యూరీ అయినా వాడొచ్చు.

పాన్ లో నూనె వేడి చేసి  నాలుగు లవంగాలు,చెక్క,బిర్యానీ ఆకు,ఒక 

స్పూన్ షాజీర వేసి వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేగనివ్వాలి.ఒక 

టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత టమాట ప్యూరీ 

వేయాలి.

సన్నగా తరిగిన పుదీనా,కొత్తిమీర వేసి బాగా వేయించి మారినేట్ చేసిన 

పనీర్ ముక్కలు వేసి కలపాలి.

తగినంత కారం,పసుపు,ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి 

బాగా కలిపి రెండుగ్లాసుల నీళ్ళు పోసి మరిగాక బియ్యం,తగినంత 

ఉప్పు వేసి కలిపి మూత  పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి.

వేడివేడిగా పెరుగుపచ్చడితో తింటే ఈపులావ్ చాల రుచిగా ఉంటుంది. 


Share/Bookmark

Tuesday, June 5, 2012

అటుకుల పులిహోర

చాలా ఈజీగా అయిదు నిమిషాల్లో అయిపోయే టిఫిన్ ఇది.ఎన్నో రకాల 

పులిహోరల్లో ఇదీ ఒకటి.లైట్ టిఫిన్ గా ఉదయమైనా,సాయంత్రమైనా 

తినొచ్చు.












 

కావలసిన పదార్ధాలు:


 

అటుకులు                            రెండు మూడు కప్పులు
 

ఉల్లిపాయ                            ఒకటి
 
పచ్చిమిర్చి                           మూడు
 
కరివేపాకు                           ఒక రెమ్మ
 
అల్లం                                చిన్న ముక్క 

చింతపండుపేస్ట్                  రెండు టీ స్పూన్స్

ఉప్పు,నూనె, పసుపు

తాలింపుకు
 
శనగపప్పు,మినపప్పు,ఆవాలు,పల్లీలు,ఎండుమిర్చి


తయారు చేసే విధానం:



లావు అటుకులను కడిగి నీరు వంపెయ్యాలి.ఒక ఐదునిమిషాలు 

పక్కన పెడితే మిగిలిన తడికి మెత్తబడి పోతాయి
 
ఉల్లి,మిర్చి,అల్లం సన్నగా తరగాలి.
 
నూనె వేడి చేసి తాలింపు వేసి పల్లీలు బాగా వేగిన తరువాత కరివేపాకు,

ఉల్లి ముక్కల మిశ్రమం వేసి చేయించాలి.
 
పసుపు వేసి అటుకులు,తగినంత ఉప్పు,చింతపండు పేస్ట్ అన్నీ వేసి 

బాగా కలపాలి.
 
అంతే పుల్లపుల్లగా ,కొంచెం కారంగా ఉండే అటుకుల పులిహోర రెడీ.


Share/Bookmark

Thursday, May 31, 2012

మాంగో- స్వీట్ కార్న్ సలాడ్

తీయతీయగా చల్లచల్లగా ఉండే ఈ మామిడి స్వీట్ కార్న్ సలాడ్ 

వేసవిలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అయినా సాయంత్రాలు తిన్నా కూడా 

బావుంటుంది.కిచెన్ లోకి కూడా వెళ్ళకుండా సింపుల్ గా చేసుకోవచ్చు.




 




కావలసిన పదార్ధాలు:


మామిడిపండు                ఒకటి

 
స్వీట్ కార్న్                    ఒక కప్పు
 
టమాటా                        ఒకటి
 
ఉల్లిపాయ                      ఒకటి
 
కొత్తిమీర                       ఒక స్పూన్
 
ఉప్పు                           చిటికెడు
 
నిమ్మరసం                   ఒక టీ స్పూన్


తయారు చేసే విధానం:


 

స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి.
 
మామిడిపండు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
 
ఒక బౌల్ లో మామిడి ముక్కలు,ఉడికించిన కార్న్,సన్నగా తరిగిన 

టమాటా,ఉల్లి,కొత్తిమీర వేయాలి.
 
చిటికెడు ఉప్పు,నిమ్మరసం వేసి బాగా కలపాలి.
 
కాసేపు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తింటే బావుంటుంది.

ఉల్లిముక్కలు  క్రంచీనెస్ కోసమే ఇష్టం లేకపోతే మానెయ్యొచ్చు.


Share/Bookmark

Wednesday, May 30, 2012

కాజు - బాదం ఖీర్

డ్రై ఫ్రూట్స్ అంటేనే రుచికి,ఆరోగ్యానికి పెట్టింది పేరు.కాజు,బాదం వీటితో 

చేసే ఈ ఖీర్ చాలా రుచిగా ఉంటుంది.పిల్లలకి మంచిది కూడా.


 





కావలసిన పదార్ధాలు:

 

జీడిపప్పు                      25
 
బాదంపప్పు                   25
 
పాలు                        అరలీటరు
 
పంచదార                   అర కప్పు
 
ఇలాచీ పొడి               పావు స్పూన్
 
సాఫ్రాన్                      కొద్దిగా


 
తయారు చేసే విధానం:


బాదంపప్పును వేడి నీళ్ళలో నానబెట్టి పొట్టు తీయాలి.
 
జీడిపప్పును,బాదంపప్పును చిన్న ముక్కలు చేసి మెత్తగా పొడి 

చెయ్యాలి.
 
ఇందులో ఒక పావు కప్పు పాలు పోసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
 
పాలు,పంచదార కలిపి బాగా మరిగించి,ఈ కాజూ,బాదాం పేస్ట్ వేసి 

ఉడికించాలి.
 
ఖీర్ చిక్కగా అయ్యాక ఒక స్పూన్ గోరువెచ్చని  పాలలో వేసిన

సాఫ్రాన్,ఇలాచీపొడి వేసి కలపాలి.
 
ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయ్యాక సర్వ్ చేసేటప్పుడు కాజు,బాదాం సన్నగా

 తరిగి పైన వేసి ఇవ్వాలి.


Share/Bookmark

Monday, May 28, 2012

బనానా స్ట్రా బెర్రీ మిల్క్ షేక్

స్ట్రా బెర్రీస్ ,అరటిపండు కలిపి చేసే రుచికరమైన మిల్క్ షేక్ ఇది.

వెరైటీ టేస్ట్ ఇష్టపడే పిల్లలకు చాలా నచ్చుతుంది




 





కావలసిన పదార్ధాలు:


స్ట్రా బెర్రీస్                     ఆరు
 
అరటిపండు                 ఒకటి
 
చల్లని పాలు                ఒక గ్లాస్
 
వెనీలా ఎసెన్స్             అర టీ స్పూన్
 
పంచదార                   రెండు టీ స్పూన్స్


తయారు చేసే విధానం



స్త్రాబెర్రీస్ ను,అరటిపండును ముక్కలు చేసి పంచదార తో కలిపి మెత్తగా 

గ్రైండ్ చెయ్యాలి.
 
ఇప్పుడు ఎసెన్స్,పాలు వేసి బ్లెండ్ చెయ్యాలి.


Share/Bookmark

Friday, May 25, 2012

గోంగూర పచ్చడి

ఆవకాయ తరువాత అంత ఇష్టంగానూ తినే పచ్చడి గోంగూర.ఈ 

పచ్చడిని కూడా చాలా రకాలుగా చేస్తారు ఎండుమిర్చి వేసి చేసే ఈ 

పచ్చడి కూడా నిలువ ఉంటుంది.


 






కావలసిన పదార్ధాలు:


గోంగూర                            ఆరుకట్టలు

 
ఎండుమిర్చి                         పదిహేను

వెల్లుల్లి రెబ్బలు                       పది

జీలకర్ర                               ఒక టీ స్పూన్ 
 
కరివేపాకు                          రెండు రెమ్మలు
 
ఉప్పు,నూనె
 
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు


 

తయారు చేసే విధానం:


గోంగూర ఆకులు కడిగి ఆరబెట్టాలి.నీరు పోయిన తరువాత రెండు 

మూడు స్పూన్స్ నూనె వేసి బాగా వేయించాలి.
 
మరొక పాన్ లోఒక స్పూన్ నూనె వేసి ఎండుమిర్చి దోరగా వేయించాలి.
 
ఎండుమిర్చి,తగినంతః ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర మెత్తగా గ్రైండ్ 

చేసుకోవాలి.
 
గోంగూరలో ఈ ఎండుమిర్చి మిశ్రమం వేసి నూరుకోవాలి.
 
తగినంత నూనె వేడి చేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే కమ్మని 

గోంగూర పచ్చడి రెడీ అవుతుంది.

కారాన్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.అలాగే 

పులుపు కూడా.గోంగూర బాగా పుల్లగా ఉంటే చింతపండు అక్కర్లేదు,

లేకపోతే కొంచెం చింతపండు కూడా వాడొచ్చు


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP