Sunday, November 4, 2012

కజ్జికాయలు

పండగలకి చేసే ముఖ్యమైన పిండివంటల్లో ఈ కజ్జికాయలు చాల 

ఫేమస్.వీటిని కొంతమంది పుట్నాలపప్పు పొడితో,మరి కొందరు 

రవ్వతోనూ చేస్తారు.అలాగే చాలామంది పంచదారతో చేస్తారు కానీ 

బెల్లం ఎక్కువ వేసి కొద్దిగా పంచదార వేస్తే చాలా రుచిగా ఉంటాయి.








కావలసిన పదార్ధాలు :



మైదాపిండి                           పావుకిలో 

వెన్న లేదా నెయ్యి                  రెండు టేబుల్ స్పూన్స్ 

ఉప్పు                                   కొద్దిగా 


లోపల నింపడానికి 



బొంబాయిరవ్వ                             రెండు కప్పులు

ఎండుకొబ్బరి                               ఒక కప్పు 

బెల్లంతురుము                             ఒక కప్పు 

పంచదార                                   మూడు స్పూన్స్ 

కాజూ,బాదం                               పది పది చొప్పున 

కిస్మిస్                                        పది 

ఇలాచీ పొడి                               అర స్పూన్ 

నూనె  


తయారు చేసే విధానం:



మైదాపిండిలో  వెన్న లేదా నెయ్యి ,కొద్దిగా ఉప్పు వేసి కొంచెం నీరు 

చల్లుకుంటూ పూరీ పిండిలా కలుపుకుని మూతపెట్టి ఉంచాలి.

ఒక పాన్ లో బొంబాయిరవ్వ వేసి సన్నని సెగపై వేయించాలి.కాస్త 

వేగిన తరువాత తురిమిన ఎండుకొబ్బరి కూడా వేసి కమ్మని సువాసన 

వచ్చేవరకూ వేయించాలి.

ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని తురిమిన బెల్లం,పంచదార,

ఇలాచీపొడి,సన్నగా తరిగిన కాజూ,బాదాం,కిస్మిస్ అన్నీ వేసి బాగా 

కలపాలి.

ఇప్పుడు నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలు చేసి పూరీలు 

చేసుకోవాలి.

కజ్జికాయల చెక్కకు కొంచెం నూనె రాసి ఈ పూరీని దానిపై వేసి  

మధ్యలో  రెండు స్పూన్స్ రవ్వ మిశ్రమం వెయ్యాలి.

అంచులు తడిచేసి చెక్కను ప్రెస్ చేసి కజ్జికాయలను చేసుకోవాలి.

ఇలా అన్నీ చేసుకుని కాగిన నూనెలో రెండువైపులా వేయించి 

తీసుకోవాలి. 

చల్లారాక స్టోర్ చేసుకుంటే ఇవి వారం రోజులవరకూ నిలువ ఉంటాయి. 


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP