Tuesday, November 8, 2011

మలై ప్రాన్స్

నాన్ వెజ్ లో చికెన్ తరువాత చాలా ఇష్టంగా తినేవి రొయ్యలు.ఈ కర్రీ 

బిర్యానీ,పులావుల్లోకి,ముఖ్యంగా కొబ్బరన్నం(కొబ్బరిపాలతో చేసే రైస్)

లోకి చాలా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


రొయ్యలు                             కిలో 

ఉల్లిపాయలు                         రెండు

పచ్చిమిర్చి                          రెండు 

కరివేపాకు                           ఒక రెమ్మ 

కొత్తిమీర                             ఒక కట్ట 

మీగడ(క్రీం)                        రెండు టేబుల్ స్పూన్స్  

అల్లంవెల్లుల్లి ముద్ద                 రెండు టీ స్పూన్స్

ఉప్పు,కారం,పసుపు,నూనె 

తాలింపుకు ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి 


మసాలా పొడి కోసం:

ఆరు లవంగాలు,చిన్న దాల్చినచెక్క ముక్క,ఒక టీస్పూన్ ధనియాలు,

అర టీస్పూన్ జీలకర్ర,ఒక టీస్పూన్ గసగసాలు,కొంచెం ఎండుకొబ్బరి 

అన్నీకలిపి మెత్తగా పొడి కొట్టుకోవాలి.


తయారు చేసే విధానం:


రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,

మిర్చి,కరివేపాకు వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి, గ్రైండ్ చేసుకున్నమసాలా

పొడి కూడా వేయాలి.పసుపు,కారం కొద్దిగా నీళ్ళు చల్లి బాగా కలపాలి.

రెండు నిమిషాల తరువాత శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసి 

ఉడికించాలి.

చివరగా తగినంత ఉప్పువేసి అవసరమైతే ఓ పావుకప్పు నీళ్ళు పోయాలి.

రొయ్యలు ఉడికి కూర దగ్గరవుతుండగా తరిగిన కొత్తిమీర,క్రీం వేసి కలిపి 

మరో రెండు నిముషాలు ఉడికించాలి.

ఎంతో రుచిగా ఉండే ఈ మలైప్రాన్స్ రోటీ,నాన్ వీటితో కూడా 

బావుంటుంది.
 


Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP